బాహుబలి సినిమాను దాదాపు ఐదేళ్ల పాటు చేసిన ప్రభాస్…. ఒక్క దెబ్బతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే ఐదేళ్లు ఒకే ప్రాజెక్టు చేసిన ప్రభాస్ ఇప్పుడు తన కరువు తీర్చుకుంటున్నాడు.
రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న వెంటనే నాగ్ అశ్విన్ తో మరొక చిత్రం ప్రకటించేశాడు. ఇది సైన్స్ ఫిక్షన్. బాలీవుడ్ అగ్రకధానాయిక ఈ సినిమా కోసం దీపికా పదుకొనే ప్రభాస్ తో జోడీ కట్టనుంది.
ఇక ఈ సమయంలో ప్రభాస్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా అభిమానులకు ఒక కొత్త అప్డేట్ ఇచ్చాడు. ‘తన్హాజీ’ సినిమా దర్శకుడు ఓమ్ రౌత్ తో ప్రభాస్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఉంటాడాని వార్తలు వచ్చాయి.
https://www.facebook.com/378233035640910/posts/2031415896989274/
ఒక రెండు మరాఠీ సినిమాల తర్వాత తన్హాజీ తో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ తో ఓమ్ రౌత్ పెద్ద లెవల్ లో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ప్రభాస్ లైవ్ ఓమ్ రౌత్ తో కలిసి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.