Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యాం” సినిమా చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించడంతో ఆ తరహాలోనే … ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ ఉన్నారు. బాహుబలి తర్వాత యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో ప్రభాస్ “సాహో” సినిమా చేయడం జరిగింది. దాదాపు ఈ సినిమా చిత్రీకరణకు రెండు సంవత్సరాల పార్ట్ టైం తీసుకున్న ప్రభావం… సినిమా విడుదల చేసి మొదటి షోకే ప్లాప్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ఈ సినిమాకి మైనస్ మ్యూజిక్ తో పాటు నార్త్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాలు ఉండటం అని అప్పట్లో చాలా మంది చెప్పటం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాదే శ్యాం సినిమాకి కూడా అదే తరహాలో సన్నివేశాలు ఉండేలా నిర్మాతలు అనగా ప్రభాస్ ఫ్రెండ్స్ యు.వి.క్రియేషన్స్ నిర్మాతలు.. దర్శకుడు రాధాకృష్ణ తెలుగు వాడు కావడంతో స్క్రిప్టులో చేంజ్ చేసినట్లు.. బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సన్నివేశాలు మళ్ళీ “రాధేశ్యాం” సినిమాలో పెట్టినట్లు టాక్. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ప్రభాస్ అభిమానులు… కొంత నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
Read More: Prabhas : ప్రభాస్ టార్గెట్ హిందీ మార్కెట్ మీదేనా..?
ఉత్తరాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే… కొంత బోర్ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క ఇటీవల కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ కలిగిన సినిమా అవుట్ పుట్ .. ప్రభాస్ తో పాటు నిర్మాతలు కలిసి చూడటం జరిగింది. ఈ క్రమంలో రాధాకృష్ణ పనితనం ప్రభాస్ కి నచ్చటం మాత్రమే కాక పూజా హెగ్డే యాక్టింగ్ కి బాగా ఇంప్రెస్ అవ్వడం జరిగింది. ఇంత ఖచ్చితంగా సినిమా హిట్ పడే అవకాశం ఉందని సినిమా ఎన్నికల్లో కాన్ఫిడెంట్ వుంది. కానీ బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాలు సినిమాలో ఉన్నట్లు వార్తలు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు.