భారతదేశంలో ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలుసు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక మార్కెట్ కలిగిన హీరో గా అవతరించాడు. అతడి సినిమాలకు పెడుతున్న బడ్జెట్ బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, రన్ బీర్ కపూర్ వంటి హీరోల చిత్రాలకు కూడా పెట్టడం లేదు. బాహుబలి విజయం తర్వాత ప్రభాస్ రేంజ్ ఆ స్థాయికి వెళ్లిపోయింది మరి. ఇక భారీ బడ్జెట్ చిత్రాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ సాధించాలంటే మొదటి చాయిస్ అయిపోయాడు ఈ యంగ్ రెబెల్ స్టార్. ఒకే ఒక్క చిత్రంతో దేశవ్యాప్తంగా పెరిగిన ప్రభాస్ మార్కెట్ చూసి దర్శక నిర్మాతలు అతని వెంట పడుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే రేంజ్ లో కాకపోయినా అటుఇటుగా ప్రభాస్ తో సమానంగా పోటీ పడుతున్న కథానాయకుడు రజినీకాంత్. వయస్సు 70 కి చేరువైపోయింది. అయినప్పటికీ రజిని మార్కెట్ మామూలుగా లేదు. ఒకపక్క ప్రభాస్…. సాహో లాంటి ప్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రంతో 150 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ లో క్లీన్ హిట్ కొడితే రజినీకాంత్ కూడా రోబో-2 వంటి భారీ చిత్రాల్లో నటించి అక్కడ తన మార్కెట్ బాగానే కాపాడుకున్నాడు. ఇక జపాన్, రష్యా వంటి దేశాలలో రజినీకాంత్ కి ఉన్న మార్కెట్ గురించి చెప్పక్కర్లేదు.
అయితే ప్రభాస్ ఇప్పుడు అక్కడ కూడా తన ఉనికిని చాటడం మొదలు పెట్టాడు. దీంతో నార్త్, సౌత్ అని తేడా లేకుండా దొరికిన చోటల్లా రజినీకాంత్ కి గట్టి పోటీ ఇస్తూ భారతదేశంలోనే కాకుండా బయట దేశాల్లో దాదాపు సూపర్ స్టార్ మార్కెట్ ను అందుకునే రేంజ్ కు వెళ్లిపోయాడు. ఇక ప్రభాస్ సాధించిన అరుదైన ఘనత రజనీకాంత్ కూడా కూళ్ళుకునేలా ఉంది. ప్రభాస్ వి రానున్న మూడు చిత్రాలు రాధేశ్యాం, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరొక సైన్స్ ఫిక్షన్ బడ్జెట్ మొత్తం కలిపి 1000 కోట్ల పైమాటే.
దక్షిణ భారత దేశంలో ఇప్పటి వరకు ఆ రేంజ్ రజనీకాంత్ కి ఒక్కడికే ఉండగా ఇప్పుడు ప్రభాస్ అతనిని దాటేశాడు. దీంతో కోలీవుడ్ లో సూపర్ స్టార్ ఫాన్స్ కడుపు మంటతో చచ్చిపోతున్నారని సోషల్ మీడియాలో టాక్. అంతేకాకుండా వారి హీరో పై కూడా ఎంతో కొంత ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ రజనీ లాంటి మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఇవేమీ పట్టించుకోరు అని కొందరు అంటున్నా…. అతని అయినా మామూలు మనిషే కదా అని మరి కొందరు అంటున్నారు.