Praggnanandhaa: ప్రజ్ఞానానంద మెల్ట్వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ చెస్బుల్ మాస్టర్స్ 2022 ఆన్లైన్ టోర్నమెంట్లో సెమీఫైనల్స్లో నెదర్లాండ్స్ కి చెందిన అనీష్ గిరిని ఓడించటం జరిగింది. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ తెల్లవారుజామున రెండు గంటల వరకు జరగగా చివరాకరికి ప్రజ్ఞానానంద గెలవడం జరిగింది. ఇక ఇదే సమయంలో మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ ని చైనాకు చెందిన డింగ్ లీరెన్ ఓడించడం జరిగింది. ప్రజ్ఞానానంద మొదటి సెమీఫైనల్ విభాగంలో అనీష్ గిరిని ఓడించడంతో ఫైనల్ కి చేరుకోవడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
16 సంవత్సరాల వయసు కలిగిన ప్రజ్ఞానానంద భారతీయ చెస్ విభాగంలో ఆణిముత్యంలా తయారయ్యాడు. కచ్చితంగా చెస్ ఆటను శాసించగల సత్తా ప్రజ్ఞానానందకి ఉందని ఐదుసార్లు భారతీయ చెస్ స్టార్ క్రీడాకారుడు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఇటీవల తెలియజేశారు. దీంతో మనోడు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో లిరెన్ తో పోటీ పడటానికి రెడీ అయ్యాడు. ప్రజ్ఞానానంద ప్రపంచ ఛాంపియన్ మాగ్నాస్ కార్ల్ సేన్ నీ గతంలోనే ఓడించి వార్తల్లో నిలిచారు. దీంతో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ప్రజ్ఞానానందకి లిరెన్ ల మధ్య నువ్వానేనా అన్నట్టుగా సాగనుంది. ఇద్దరూ కూడా ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్సన్ నీ ఓడించిన ఆటగాళ్లు కావటంతో ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగనుంది అని.. క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.