Modi Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం లో ఎప్పుడు ముందుంటారని అందరికీ తెలిసిందే. ఒకపక్క సమాజానికి మంచి పనులు చేస్తూ మరో పక్క ప్రభుత్వాలు ఏమైనా ప్రజల విషయంలో తేడా చేస్తే నిర్మొహమాటంగా ప్రశ్నలతో కడిగిపారేసే స్వభావం ప్రకాష్ రాజు ది. తెలంగాణలో కొన్ని గ్రామాలను కూడా ప్రకాష్ రాజు దత్తత తీసుకునీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.. తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా బిజెపి నాయకులు ప్రధాని మోడీ విషయంలో అత్యుత్సాహంగా వ్యవహరించడం పట్ల సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
విషయంలోకి వెళితే ప్రధాని మోడీ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ రోజుకి రెండు గంటల నిద్ర పోతారని 22 గంటలు దేశం కోసం పనిచేస్తారని పోస్ట్ పెట్టడం తెలిసిందే. ఈ పోస్ట్ పై ప్రకాష్ రాజ్ విటర్ లో స్పందించారు. ప్రకాష్ రాజు ఏమన్నారంటే…‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు.
ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కెసిఆర్ చేస్తున్న పాలిటిక్స్ లో… ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కెసిఆర్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో ఢీ అంటే ఢీ అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటన కూడా కేసీఆర్ చేపట్టారు ఆసమయంలో ప్రకాష్ రాజ్ కూడా ఉండటం మనం చూశాం. ఇటువంటి తరుణంలో మోడీ పై ప్రకాష్ రాజ్ ఈ రీతిగా కామెంట్లు చేయటం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.