Pregnant Women: చాలా మంది గర్భిణీలు, వారి బంధువులు సహజ ప్రసవం అవుతుందా లేదా అని ఆందోళన చెందుతుంటారు..!! నార్మల్ డెలివరీ అవ్వాలని అనేక జాగ్రత్తలు పాటిస్తారు.. అయితే డెలివరీ చివరి సమయంలో కొన్ని పండ్లను తీసుకుంటే.. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..!! ఆ పండ్లు ఏమిటంటే..!?
పైనాపిల్, పచ్చి బొప్పాయి, ఖర్జూరం, రెడ్ స్ట్రాబెర్రీ లీఫ్.. ఈ ప్రూట్స్ ను డెలివరీ చివరి సమయంలో తీసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు.. బొప్పాయిని తినకూడదని చెబుతారు కదా అనుకోవచ్చు.. ప్రెగ్నెన్సీ వచ్చే నెల మొదట్లో అసలు తినకూడదు అయితే ఆఖరి రోజుల్లో మాత్రమే తీసుకుంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి దోహదపడుతుందని అంటున్నారు. పైనాపిల్ ను కూడా డెలివరీ డేట్ దగ్గరికి వచ్చిన తర్వాత తింటే నార్మల్ డెలివరీ అయ్యేందుకు సహాయపడుతుంది.
ఖర్జూరంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిని నెలలు నిండిన తరువాత తీసుకుంటే సహజ ప్రసవం అయ్యేలా చేస్తుంది. కానీ గెస్టేషనల్ డయాబెటిస్ ఉన్న గర్భిణీ స్త్రీలు మాత్రం ఖర్జూరం తీసుకోకూడదు. డెలివరీ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత రెడ్ స్ట్రాబెర్రీ లీఫ్ తో ఆంటీ తయారు చేసుకుని ప్రతిరోజూ తాగితే నార్మల్ డెలివరీ అవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటితో పాటు డెలివరీ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు టెన్షన్, ఒత్తిడికి గురి చేసే విషయాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. మనసుకు ఆహ్లాదమైన పనులు మాత్రమే చేయాలి. ఈ సమయంలో ఎక్కువగా శారీరకశ్రమ చేయకూడదు. ప్రతి మూడు లేదా నాలుగు గంటలకు ఒకసారి ఐదు నిమిషాల పాటు నడుస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్న జాగ్రత్తలన్నీ పాటిస్తే సహజమైన డెలివరీ అవుతుంది.