Ukraine Russia War: రష్యా దేశాల మధ్య జరుగుతున్న భీకరమైన పోరు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఏకంగా ఉక్రెయిన్ పై అణు దాడికి దిగటానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమణ లక్ష్యంగా రష్యా ప్రస్తుతం చేస్తున్న దాడులు.. ప్రధానంగా ప్రభుత్వ భవనాలు అదేవిధంగా సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడుతున్నారు. అయినా కానీ ఉక్రెయిన్ ఎక్కడ వెనకడుగు వేయకుండా మరింత దూకుడుగా వ్యవహరిస్తే ఉండటంతో తాజాగా రష్యా హైపర్ సోనిక్స్నూ రంగంలోకి దింపి… బాంబుల వర్షం కురిపిస్తుంది.
రాజధాని కీవ్ సహా మిగతా ప్రధాన నగరాలలో ధ్వంసం సృష్టించే దిశగా… రష్యా బలగాలు దూసుకుపోతున్నాయి. దీంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బంకర్ లలో దాక్కున్న జనాలు … మరింత భయపడే పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా బలగాలకు దీటుగా పోరాటం చేస్తున్నాయి. ఈ తరుణంలో రష్యాకు చెందిన కీలక సైనికాధికారి మరణించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే ఈ నెల రోజులు కావస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలెండ్లో పర్యటించనున్నారు.
ఉక్రెయిన్కు ఆనుకొని ఉన్న పోలెండ్కు ఈ నెల 25న బైడెన్ వెళ్లనున్నారు. ఉక్రెయిన్ కి పక్కనే ఉండే పోలాండ్ లో అమెరికా అధ్యక్షుడు పర్యటన అంతర్జాతీయంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది. అరెస్టు చేస్తున్న దాడుల విషయంలో పోలాండ్ అధ్యక్షుడితో జో బైడెన్ చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలెండ్ పర్యటనకు ముందు బెల్జియం పర్యటనకు బైడెన్ వెళ్తారు. బ్రస్సెల్స్ లో ఈయూ, నాటో సమ్మిట్లో బైడెన్ పాల్గొననున్నారు. ఏదిఏమైనా భీకరమైన దాడులు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ దేశానికి పక్కనే ఉండే పోలాండ్ లో అమెరికా అధ్యక్షుడు పర్యటన చేపట్టడం అంతర్జాతీయంగా వైరల్ గా మారింది.