ప్రస్తుతం కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో, పరిసరాలలో కూడా మార్పులు వచ్చాయి. ఇలా ఎన్నో మారుతున్నా ఈ కాలంలో మనం తినే ఆహార పద్ధతిలో కూడా మార్పులు వచ్చాయి. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. అన్నంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా అన్నంను వండే విధానంలో మార్పులు కూడా వచ్చాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ సమాజంలో ఉన్నాము. అన్నం వండే విధానంలో కట్టెల పొయ్యి నుండి ఎలక్ట్రిక్ కుక్కర్ వరకు చేరింది. ఈ రెండింటికీ మధ్యలో చాలా మంది ప్రెజర్ కుక్కర్ లో ఉడికించే వాళ్ళు ఉన్నారు. కట్టెల పొయ్యి వాడకంలో చాలా తక్కువగా ఉంది. అప్పటిలో అన్నం వండితే దాని నుంచి వచ్చిన గంజిని కూడా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్ వాడుతున్నారు గంజి కూడా అన్నం లోనే ఉంటుంది. గంజితో ఉన్న అన్నం తీసుకోవడంలో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. కానీ అది విద్యుత్ నుండి తయారవుతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండినా అన్నాన్ని తింటే శరీరంలో ఉన్న ఎముకలు బలహీనమవుతాయి. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాకుండా చాలా మంది పాత్రలలో వండుతారు కానీ అందులో ఉన్న గంజిను పారబోస్తారు. దీనివల్ల అన్నంలో ప్రోటీన్ విలువలు తక్కువగా ఉంటాయి. ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండటం వల్ల ఎక్కువగా పోషకాలు అందుతాయి. ఎందుకంటే అందులో అన్నం గంజిని పీల్చుకుంటుంది.
శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. చాలామంది బియ్యం కడిగి నానబెట్టి ఉడికిస్తారు. కానీ అలా నానబెట్టి ఉడికిస్తే అందులో పోషక విలువలు తగ్గుతాయి. అంతేకాకుండా బియ్యంలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుకే కడిగిన వెంటనే బియ్యాన్ని ఉడికించాలి. కొందరు పాత్రలలో వండేవారు సరిపడా నీరు పోసి వండుతారు. దీని వల్ల ఎలాంటి పోషక విలువలు ఆవిరి ద్వారా కూడా బయటికి పోవు. కొందరు సరిపడా కంటే ఎక్కువ నీరుపోసి గంజి ద్వారా పారబోస్తారు. దీని వల్ల పోషకాలు అందవు. అందుకే ఎలిక్ట్రిక్ కుక్కర్ ని పక్కన పెట్టి ప్రెజర్ కుక్కర్ ఉపయోగించడం మంచిది!