IPL-2021: ఖైదీలు మనుషులే.. వారికి కొన్ని కోరికలు ఉంటాయి.. జైలు నిబంధనలు అతిక్రమించినంత వరకు.. వారి ప్రవర్తన తీరులో ఇబ్బందికర అంశాలు లేకపోతే.. వారి హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జైలు అధికారులదే.. ఒక్కోసారి వారి కోర్కెలు విచిత్రంగా ఉంటాయి.. ఈ నేపథ్యంలో ఒక జైలు లోని ఖైదీలు ఐపీల్ మ్యాచ్ లు చూడకపోతే ముద్దకూడా ముట్టమని భీష్మించుకొని కూర్చున్నారు.. ఈ సంఘటనకు సంబంధించిన పూరి వివరాలు ఇలా ఉన్నాయి..
ఐపీల్ – ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచ క్రికెట్ ప్రియులకు అత్యంత ఇష్టమైన లీగ్.. ఐపీల్ మ్యాచ్ లకు కరోనా కూడా అడ్డుకాలేకపోయింది.. మ్యాచ్ లు స్టేడియం లోనే చూడక్కర్లేదు.. ఎంచక్కా ఇంట్లో కూర్చొని వీక్షించచ్చు.. ప్రత్యక్ష ప్రేక్షకులు లేకుండానే ఐపీల్ అదరగొడుతున్నారు క్రికెటర్స్.. ఐపీల్ ఫీవర్ సగటు మనిషి నుంచి ఖైదీల వరుకు ఉంది.. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లోని ఒక జైలు లోని ఖైదీలు తమకు ఐపీల్ మ్యాచ్ లు చూసేలా అవకాశం కల్పించమని కోరుతూ ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు.. ఈరోజు ఉదయం టిఫిన్ చేయకుండా బైఠాయించారు.. ఆ జైలు సూపరింటెండెంట్ ప్రహద్ శుక్లా ఆ సమయంలో లక్నో లోని అధికారులతో సమావేశంలో ఉన్నారు.. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే జైలు కు చేరుకొని ఖైదీలు తో చర్చలు జరిపారు.. ఎట్టకేలకు ఖైదీల డిమాండ్లకు జైలు అధికారులు అంగీకరించారు.. దీంతో ఖైదీలు తమ దీక్షను విరమించారు.