Puja Heghde: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హరోయిన్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ముద్దు గుమ్మ పూజా హెగ్డే. సమంత .. కాజల్ వంటి బిగ్ స్టార్ హీరోయిన్ లు పెళ్లి చేసుకుని ఇంటివారైన తర్వాత.. పూజా హెగ్డే వరుస పెట్టి ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పవన్ కళ్యాణ్ తప్ప మిగతా స్టార్ హీరోలందరితో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తున్నా పూజా హెగ్డే.. తాజాగా తన రెమ్యూనరేషన్ విషయంలో ఒక్కసారిగా అమౌంట్ అమాంతం పెంచేసిందట.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ లు… పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో దండాలు పెట్టే పరిస్థితి కనిపిస్తుందట. కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఆర్థికంగా అనేక కష్టాలు… ముందునుంచి ఉన్నప్పటికీ ఇటీవలే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు పరిస్థితి మారిన సమయంలో పూజా హెగ్డే రెమ్యూనరేషన్ పెంచడం పట్ల ఇండస్ట్రీలో నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. దాదాపు సినిమాకి తాజాగా మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకోవడానికి పూజా హెగ్డే రెడీ అయినట్లు.. ఏమాత్రం తగ్గించే విషయంలో రాజీ పడటం లేదని వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ సినిమా ప్రాజెక్టు తప్ప మరో సినిమాకి అవకాశం ఇవ్వలేదు.
ఇదే సమయంలో ఆమె నటించిన చాలా సినిమాలు ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల అవటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్ తో నటించిన రాదేశ్యం, ఆచార్య, బీస్ట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సర్కస్ కూడా రిలీజ్ కానుంది. గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా లో అలరించిన పూజా హెగ్డే తర్వాత పైన ఉన్న సినిమాలకు కొద్దిగా రెమ్యూనరేషన్ అంతగా ఇప్పుడు మాత్రం కరోనా కష్టకాలంలో ఒక సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల పారితోషికాన్ని అమాంతం పెంచినట్లు.. దీంతో పూజా హెగ్డే తో సినిమా విషయంలో నిర్మాతలు ‘ అమ్మా తల్లీ నీకోక దండం .. ‘ అంటూ ఆమె దరిదాపుల్లోకి వెళ్లడం లేనట్లు తెలుస్తోంది.