Prophet Row: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుండి సస్పెండ్ అయిన నువూర్ శర్మ పై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఇప్పటికీ ఆ వేడి చల్లారలేదు. నుపూర్ శర్మ పై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. ఆమెను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బీజేపీ మాత్రం నుపూర్ శర్మతో పాటు ఆమె వ్యాఖ్యలను సమర్ధించిన నవీన్ జిందాల్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత కొద్ది రోజులుగా ఆమెను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఆమెపై సెటైర్ లు వేశారు. నుపూర్ శర్మ భవిష్యత్తులో బడా రాజకీయ నేతగా ఎదుగుతారనీ, ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నువూర్ శర్మను అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించాలని మరో సారి డిమాండ్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీ ఆమెకు అండగా నిలుస్తొందని విమర్శించారు. దీనిపై ప్రధాని మోడీ నోరు మెదపడం లేదని అన్నారు. రాష్ట్రం నుండి పోలీసులను ఢిల్లీకి పంపి ఆమెను అరెస్టు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్.
ఇదే సందర్భంగా యూపీలో యూక్టివిస్ట్ ఫాతిమా ఇల్లు కూల్చివేతపైనా మండిపడ్డారు అసదుద్దీన్. ఆమె ఇంటిని ఎందుకు కూల్చివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫాతిమా తండ్రి అల్లర్లు సృష్టించాడని బీజేపీ ఆరోపిస్తోందనీ, ఆ ఆరోపణలు నిజమా కాదా తేలకముందే ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు అసదుద్దీన్. ఆయన అల్లర్లు సృష్టించాడా లేదా అన్నది విచారణ చేసిన తరువాత తేలుతుందనీ, కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇష్టానుసారంగా ఇల్లు కూల్చివేయడం ఏమిటని అసదుద్దీన్ మండిపడ్డారు.