భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ -2022 విజేతగా గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్ లో చైనా షట్లర్ వాంగ్ జీ యీపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకోవడం జరిగింది. చైనా షట్లర్ పై 21-9, 11-21, 21-15 తేడాతో సింధు గెలవడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ప్రారంభ సెట్ సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. రెండో సెట్ చైనా ప్లేయర్ గెలిచింది. ఇక మూడో సెట్ కి వచ్చేసరికి ఇద్దరి మధ్య పోటాపోటీ పెరిగింది కాని చివర ఆఖరికి సింధు గెలవడం జరిగింది.
PV Sindhu: పీవీ సింధు ని కొనియాడిన.. పార్లమెంటు & రాజ్యసభ సభ్యులు..!!
దీంతో కెరీర్ లో ఫస్ట్ టైం సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. అయితే ఈ ఏడాదిలో పీవీ సింధుకు ఇది మూడో టైటిల్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సింగపూర్ ఓపెన్ విజేతగా గెలిచిన పీవీ సింధు పై ప్రశంసల వర్షం కురిపించారు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. అంత మాత్రమే కాదు సింగపూర్ ఓపెన్ టోర్నీలో సింధుకి ఇది తొలి టైటిల్ అని కొనియాడారు.
అంతకుముందు కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింగపూర్ ఓపెన్ టైటిల్ తో మూడో విజయం సింధు తన ఖాతాలో వేసుకున్నట్లు సీఎం జగన్ తెలియజేశారు. ఇక ఇదే సమయంలో వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా… పీవీ సింధు ని అభినందించడం జరిగింది. భారతదేశానికే పీవీ సింధు గర్వకారణం అని అభివర్ణించారు. ఇదే జోరు కొనసాగించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని.. కొనియాడారు.