Raashi Khanna: మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం థాంక్యూ.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇటీవల రెండో షెడ్యూల్ ఇటలీలో పూర్తి చేసుకుంది.. కరోనా పరిస్థితుల్లో కూడా థాంక్యూ షూటింగ్ కోసం రాశి ఖన్నా ఇటలీ వెళ్ళొచ్చింది.. తాజాగా రాశిఖన్నా ఈ షెడ్యూల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చింది..!!
Read More: Kannulu chedire: కన్నులు చెదిరే పాటను విడుదల చేసిన హీరో అడవి శేష్..
రాశి ఖన్నా మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇటలీ వెళ్ళాలంటే ముందు భయపడ్డాను. అయితే సినిమా మా త్వరగా పూర్తి చేయాలని వెళ్ళాను. ఇటలీ ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే షూటింగ్ షెడ్యూల్ లో కూడా కరోనా నిబంధనలను పాటిస్తూనే చిత్రీకరణ జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రోజుకు 18 గంటల పని చేసిన సందర్భాలు ఉన్నాయని” రాశి ఖన్నా తెలిపింది..
ఈ సినిమా కథ ఆధారంగా ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో రాశి ఖన్నా ఒకరు. ఈ సినిమాలో చైతు హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం లో ఈ సినిమాను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.