Radhe Shyam Team: కరోనా సెకెండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది.. రోజు రోజుకి కరోనా కేసుల నమోదు సంఖ్య పెరుగుతోంది.. వీటితోపాటు కరోనా మరణాల రేటు కూడా వృద్ధి చెందుతోంది.. కరుణ బారిన పడిన వారికి ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు.. ఇటీవల 1970లోని ఇటలీ ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తయింది.. ఈ సెట్ ను తమ వంతు సహాయంగా రాధే శ్యామ్ టీమ్ ను కరోనా రోగుల చికిత్సకు ఇచ్చారు..!!
అంతేకాకుండా రాధే శ్యామ్ టీమ్ కరోనా ట్రీట్మెంట్ కు కావాల్సిన బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర పరికరాలను అందించడం కోసం అందరూ తమ వంతు సాయం చేశారు.. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 6 కోట్లు ఖర్చు చేశారు.. ఈ విరాళాలతో స్త్రెచ్చర్ లు, 50 కస్టమ్ పడక మంచాలు, వైద్య పరికరాల స్టాండ్, సెలైన్ స్టాండ్, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలు ఉన్నాయి.. వీటిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఇచ్చారు. రాధే శ్యామ్ సినిమా సెట్ ను కరోనా రోగుల చికిత్సకు ఇవ్వడం పై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న అందమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్.. పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా నటిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. టీజర్ చూశాక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..