ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఉద్యమం మీ టూ. ఆన్ లైన్ వేదికగా మహిళల పట్ల సమాజంలో వారిపై జరుగుతున్న హింసను, లైంఘిక దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇది. దీని ద్వారా ఎంతో మంది తమ భావాలను వ్యక్త పరుస్తూనే ఉన్నారు. సాధారణ జనం నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల దాకా ఈ మీ టూ ఉద్యమంలో పాల్గొన్నవారున్నారు. ఎంతో మంది సెలబ్రిటీలపై, రాజకీయ నాయకుల పై మీ టూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే..
కాగా లైంగిక హింసలను ఎదుర్కొంటున్న మహిళలకు అండగా, వారికి స్వాంతన కలిగించే దిశగా వారిని నడిపించడానికి ఏర్పటు చేసిన ఉద్యమమే ఈ మీ టూ. ఈ ఉద్యమం ద్వారా తమ పట్ల జరిగిన దాడులను తెలుపుకున్నారు. కాగా ఈ మీటూ ఉద్యమం పట్ల బాలీవుడ్ నటుడు ముఖేశ్ ఖన్నా వ్యాఖ్యానించిన తీరు పట్ల రాధిక సీరియస్ అయ్యారు. ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఈ ఉద్యమంపై అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నింట్లో పురుషులతో మేమూ సమానమనే ధోరణి వలనే ఈ మీటూ ఉద్యమం వచ్చిందని, ఇంటిని పట్టునే ఉంటూ ఇంటి పనులు చేయడమే మహిళల పని అని ముఖేశ్ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై న పలువురు విమర్శలు గుప్పించారు. ఈయన వాక్యలపై గాయని చిన్మయి కూడా విమర్శించారు. నిజనిజాలేంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడతారని ఆమె ట్వీట్ చేశారు.
అలాగే మహిళలు ఉద్యోగాలు చేయడం మూలంగానే ఈ మీటూ ఉద్యమం వచ్చినట్టయితే మరి మగాల బుద్ధి ఏమయిందని, పురుషుల హింసాత్మక కోరికలకు మహిళలు బలవుతున్నారని ఆమె తెలిపారు. పురుషుల గురించి ఎందుకు ప్రశ్నించలేదని ఆమె పేర్కొన్నారు. మగాళ్ల మూర్కత్వ ధోరణి చూస్తుంటో భయంగా అనిపిస్తోందని నటి రాధిక ట్వీట్టర్ ద్వారా తన భావాలను వ్యక్తపరిచారు. ఇలాంటి మాటలు మాట్లాడే ముందు నిజనిజాలేంటో తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.