Raghu Kunche: రఘు కుంచె ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన సంగీతంతో ఎందరో ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు.. తాజాగా రఘు కుంచె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది..
“మనుషుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న మెడిసిన్స్ ని దాచిపెట్టి.. బ్లాక్ మార్కెటింగ్ చేసే దరిద్రులారా.. ఇలా సంపాదించిన డబ్బుతో.. నువ్వు, నీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు అనుకుంటే.. నువ్వు తినే ప్రతి ముద్దలో ఒక శవం కనబడుద్దిరా నీ లైఫ్ అంతా.. కొంచెం అయినా మారండిరా.. ఇలాంటి విపత్కర సమయంలోనైనా..” అంటూ రఘు కుంచె ట్వీట్ చేశారు.. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ.. దీని వెనక ఏదో బలమైన కారణం, కడుపు మండి ఉంటే తప్ప రఘు కుంచె ఇలా ట్వీట్ చేసి ఉంటారని అందరూ అనుకుంటున్నారు..
ఒకవైపు ఆసుపత్రిలో బెడ్లు కొరత, ఆక్సిజన్ కొరత చాలదన్నట్టు.. ఉన్న మందులు కూడా దాచిపెట్టి బ్లాక్ మార్కెట్ లో మందుల అమ్ముతున్నారు.. ఇలా సంపాదించిన డబ్బు మీ ప్రాణాలు కాపాడే చేస్తుందా.. ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించండి.. కొంచెం అయినా మీలో మానవత్వాన్ని బ్రతికించండి.. లేదంటే కడుపు మండిన జనం తిరగబడితే తిరగబడే క్షణం వస్తే ఎవ్వరూ మిగలరు దయచేసి మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేయకండి కనీసం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా.. కొంచెం మానవత్వం చూపించండిరా.. చరిత్రలో మిగిలిపోతారు అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు..
మనుషుల ప్రాణాలు కాపాడటానికి ఉన్న Medicines ని దాచి పెట్టి black marketing చేసే దరిద్రులారా …ఇలా సంపాయించిన డబ్బుతో
నువ్ నీ family happy గా ఉంటారు అనుకుంటే ..
నువ్ తినే ప్రతి ముద్దలో ఒక శవం కనబడుద్ధిరా నీ life అంతా ….కొంచెం ఐనా మారండిరా ఇలాంటి విపత్కర సమయంలోనైనా ???— Raghu kunche ?? రఘు కుంచే (@kuncheraghu) May 8, 2021