హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ డిశార్జ్ అయ్యారు. హై బీపీ కారణంగా అస్వస్థతకు గురైన రజనీ రెండు రోజులుగా అపోలో ఆసుపత్రిలో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. రజనీకి నిర్వహించిన అన్ని రకాల పరీక్షల రిపోర్టులు నార్మల్ గానే ఉన్నట్లు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. కొద్ది సేపటి క్రితం ఆసుపత్రి వైద్య బృందం (టీమ్ ఆఫ్ డాక్టర్స్) రజనీ వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించిన అనంతరం రజనీ పూర్తిగా కోలుకున్నట్లు తెలియజేస్తూ డిశార్జ్ కు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం రజనీని డిశ్చార్జ్ చేయగా బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుండి చార్టెడ్ ఫ్లైట్ లో రజనీ చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు.
అన్నాతైే సినీ షూటింగ్ సందర్భంగా పది రోజుల క్రితం రజనీ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినీ షూటింగ్ సందర్భంగా చిత్ర బృందానికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. షూటింగ్ సిబ్బందిలో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అియన నేపథ్యంలో రజనీ తో సహా పలువురు సినీ ప్రముఖులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండిపోయాయి. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం రజనీ హై బీపీ కారణఁగా తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. రజనీ అనారోగ్యంకు గురైయ్యారని తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు రజనీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖులు నేరుగా ఫోన్ చేసి రజనీని పరామర్శించారు. అభిమానులు రజనీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేశారు. అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స అనంతరం రజనీ పూర్తిగా కోలుకుని డిశార్జ్ కావడంతో ఆభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.