Rajinikanth: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కొత్త కేసులు, మరణాలు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఒకానొక సమయంలో కరోనా వైరస్ కేసులు మరియు మరణాల లెక్కలకి వచ్చేసరికి అమెరికా ముందుండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో కరోనా గురించి మాట్లాడాల్సి వస్తే ఇండియా గురించి మాట్లాడుకుంటున్నారు. అంతగా దేశంలో పరిస్థితి దిగజారి పోయింది. బెడ్ల విషయంలో ఆక్సిజన్ కొరతతో కరోనా బారిన పడిన రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో సెలెబ్రిటీలు సామాన్య ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రజినీకాంత్ 50 లక్షలు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే సూర్య బ్రదర్స్, అజిత్ లాంటివాళ్ళు విరాళాలు ప్రకటించారు. ఈ తరుణంలో రజినీకాంత్ కూడా ముందుకు వచ్చి కష్టకాలంలో విరాళం ప్రకటించడంతో రజినీ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో హుడా కరోనా తీవ్రత అధికంగా ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక.. వెంటనే రాష్ట్రంలో రెండు వారాలపాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదిఏమైనా కరోనా లాంటి కష్టకాలంలో విపత్కర సమయంలో ప్రభుత్వాలకు సాయం అందించడానికి సెలబ్రిటీలు ముందుకు వస్తూ ఉండటంతో.. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యి.
ఇక సోనూసూద్ అయితే గత ఏడాది లాక్ డౌన్ పెట్టిన నాటి నుండి… వలస కార్మికులకి దేశంలో పేదల కి.. అనేక సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో చదువుకోలేని పేదలకు చదువు.. తన సొంత డబ్బుతో చెప్పిస్తూ మరో పక్క… ఉపాధి లేని వారికి కూడా ఉద్యోగం కల్పిస్తూన్నాడు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా బారిన పడిన అనేక మంది రోగులు ఆక్సిజన్ కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో… ఇతర దేశాల సాయం తో ఆక్సిజన్ సిలిండర్లు తీసుకు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే దేశంలో ముఖ్యమంత్రులకు సెలబ్రిటీలు మరియు హీరోలు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.