Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం పై గత కొన్నాళ్ల నుండి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగానే రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని గతంలోనే .. అభిమానులకు తెలియజేయడం జరిగింది. వాస్తవానికి తమిళ అసెంబ్లీ ఎన్నికలలో రజినీకాంత్ పోటీ చేయాలని పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా గత ఏడాది డిసెంబర్ చివరి వరకు జరగగా సరిగ్గా.. పార్టీ పేరు మరియు విధి విధానాలు ప్రకటించాలని అనుకున్న సమయంలో… ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో తాను రాజకీయాల్లోకి వెళ్లడం భగవంతునికి ఇష్టం లేదని మూడు పేజీల లెటర్లు రాసి అభిమానులను నిరాశ పరిచారు.
అప్పటి వరకు అభిమానులు తమిళ రాజకీయాలలో రజిని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని మార్పు తీసుకు వస్తారని భావించగా.. రజిని ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం తో .. అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందారు. ఇటువంటి తరుణంలో రజిని తన అనారోగ్య కారణానికి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
Read More: Rajinikanth: రిటైర్మెంట్ ఆలోచన లో రజినీకాంత్..!!
ఇందుకోసం ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అమెరికా విధిస్తుండటంతో స్పెషల్ పర్మిషన్ కేంద్రం వద్ద తీసుకుని అమెరికా కి వెళ్లాలని రజినీకాంత్ కి ట్రీట్మెంట్ ఇప్పించాలని కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో.. వెళ్ళటానికి కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. కాగా రజినీకాంత్ చికిత్స తీసుకుని దాదాపు కొన్ని నెలల పాటు అమెరికాలోనే ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం.