తెలుగు, తమ్మిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలో తన అందచందాలతో కోట్లాది మందిని తన అభిమానుల ఖాతాల్లో వేసుకుంటున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. ఏ లాంగ్యేజ్ లో చేసినా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకంటదీ ముద్దుగుమ్మడు. ఎప్పడు చూసినా జిమ్ లో కాలక్షేపం చేస్తూ ఫిట్ నెస్ ను మెయిన్ టనెన్స్ చేస్తూ ఉంటుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది ఈ భామ.
ఇదిలా ఉంటే ఈ సుందరి ఫిట్ నెస్ కోసం తెగ కుస్తీలు పడుతూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడూ హెల్దీగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు నేను తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఎంతో ప్రత్యేకమైనదని ఈ సుందరి తాజాగా వెళ్లడించారు. అదేనండి వీగన్ గురించి ప్రస్తావించారు.
వీగన్ మీన్స్ చెట్లనుంచి వచ్చే ఆహారం, అలాగే మాంసాహారం, జంతువుల నుంచి వచ్చే పాలు వంటివి తీసుకోకుండా ఉండటం. ఇది ఒక మంచి నిర్ణయమని ఆమె చెప్పుకొచ్చారు. నవంబర్ 1 న ప్రపంచ వీగన్ దినోత్సవంగా జరుపుకుంటారు. వీగన్ నిర్ణయం తీసుకుని సుమారుగా సంవత్సరం కావొస్తుందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.
దీనిపై ఆమె తన భావాలను వ్యక్తం చేశారు. మాంసాహారాన్ని మానేయడం మూలంగా ప్రశాంతంగా అనిపించేదని, అలాగే శరీరంలో ఆ తాలుకు మార్పులు కనిపించాయని రకుల్ తెలిపారు. దీనితో పాటుగా శరీర నిగారింపు కూడా పెరిగిందని వెళ్లడించారు. సో ఈ మంచి మార్పును నేను ఎల్లప్పుడూ ఆహ్వానిస్తానని ఆమె పలికారు.