Ram Charan: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని వారాల నుండి లక్షల లో కేసులు నమోదు అవుతూ ఉండటం తో కరోనా బారిన పడిన రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెడ్లు అందక ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్న గాని వైరస్ ని ఏ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలకు అండగా చాలా మంది ప్రముఖులు నిలబడుతూ తమ వంతు సాయాన్ని అందించారు.
సోనూసూద్ అయితే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా లాక్డౌన్ టైం నుండి ఇప్పటివరకు అనేక మందికి అనేక రకాలుగా సేవలందిస్తున్నారు. కొంతమంది ఈ రోజు ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు అందిస్తూ తమ వంతుగా ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఇలాంటి తరుణంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్నేహితుడు కి చెందిన గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించింది.
చైనా నుండి తప్పించిన ఈ ప్రొడక్ట్ .. కరోనా బారిన పడిన రోగులను ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన స్నేహితుడు చేసిన సాయం పట్ల సోషల్ మీడియాలో స్పందించారు. ‘ప్రభుత్వానికి 1000కి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తున్న నా స్నేహితుడు కంపెనీ గ్రీన్ కో గ్రూపునకు కుడోస్. కరోనా సవాల్ విసురుతున్న ఇలాంటి కష్ట సమయాల్లో దేశంలోని ప్రభుత్వాసుపత్రులకు సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించడం గొప్ప విషయం’ అని చరణ్ పోస్ట్ పెట్టారు.