తెలుగునాట టాప్ యాంకర్లలో అనసూయ కూడా ఒకరు. ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమైన “జబర్దస్త్ కామెడీ షో ” ద్వారా బుల్లితెరపై తిరుగులేని యాంకర్గా పేరు సంపాదించుకుంది అనసూయ. ఈ షో తరువాత ఆమె హోస్ట్ గా వ్యవహరిస్తూ చాలానే ప్రొగ్రామ్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే సినిమా అవకాశాలు కూడా చాలానే వచ్చాయి. అయితే, వాటిలో నటించిన ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి.
కానీ, టాలీవుడ్ అగ్రదర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమా ద్వారా అనసూయ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర నిజంగానే ఆమె పేరులా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అనసూయ అంటే గుర్తుపడతారో లేదో తేలియదు కానీ.. రంగమ్మత్త అంటే తెలుగు నాట తెలియని వారు లేరనే స్థాయిలో ఆ పాత్ర ప్రేక్షకులలోకి దూసుకుపోయింది. అయితే, అనసూయకు ఈ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో క్రెడిట్ అంతా కూడా దర్శకుడు సుకుమార్దే అని చెప్పాలి.
అయితే, అనసూయ కెరియర్ వెండితెరపై దూసుకుపోయేలా చేసిన సుకుమార్కు ఆమె నో చెప్పిందట. దీంతో అల్లు అర్జున్ తో పాటు సినీ వర్గాలు కూడా పెద్ద షాక్ గురవుతున్నారు. ఎందుకంటే తనకు లైఫ్ ఇచ్చిన సుకుమార్, బన్నీలు ఇచ్చిన మరో ఆఫర్కు అనసూయ నో చెప్పిందనే వార్తలు సినీనాట తెగ హల్చల్ చేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడుస్తోంది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం బన్నీ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో “పుష్ప” అనే సినిమా తెరకెక్కుతున్నది.
ఇందులో ఓ కీలక పాత్ర పోషించడానికి అనసూయను సంప్రదించారట సుకుమార్. డీగ్లామర్ రోల్ లో మేకప్ లేకుండా నటించాలని సుకుమార్ చెప్పడంతో దానికి అనసూయ నో చెప్పిందట. తాను మేకప్ లేకుండా బయట కనిపించకూడదని నిర్ణయించుకున్నానంటూ.. పుష్ఫ ఆఫర్కు నో చెప్పిందట. కాగా, ఈ సినిమాలో బన్నీతో పాటు అగ్ర కథానాయిక రష్మిక కూడా డీగ్లామర్ రోల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరో, డైరెక్టర్, హీరోయిన్లు నటిస్తున్న సినిమాలో కీలక పాత్రకు అనసూయ నో చెప్పడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్గా మారింది. కాగా, అనసూయ కోలీవుడ్ పిలుపుతోనే ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.