ఈ పకృత్రి ఒక అద్బుతం. ఇక్కడ ఉండే జీవజాలం మరింత అద్బుతం. భూమి అవతరించి లక్షల సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యలు ఇంకా ఉన్నాయి. అలాగే, చిత్ర విచిత్రమైన జీవులు కూడా ఉన్నాయి. ఇప్పటికి మనుషులు చూడని అనే క జీవులు నిత్యం వెలుగు చూస్తూ.. ఇలాంటి అందమైన లేదా క్రూరమైన జీవులు కూడా ఉన్నాయా అనిపిస్తోంది కొన్ని అరుదైన, కొత్త జీవులు కనిపిస్తే.. !
అలాంటి అరుదైన జీవే తాజాగా వెలుగుచూసింది. అందరినీ అశ్చర్యకితులను చేసింది. ఎందుకు అనుకుంటున్నారా? ఆ జీవి రంగు అలాంటిది మరి. అదే తాబేలు. ఆ అందులో ఏముంది గొప్ప.. విచిత్రం అనుకోకండి.. అది చూడటానికి సాధారణ తాబేలు కాదు. అత్యంత అరుదైన పసుపు వర్ణంలో మెరిసిపోతున్న తాబేలు మరి. అవును నిజమే.. పూర్తి శరీరం పసుపు రంగంలోనే ఉంది.
పూర్తి పసపు వర్ణంలో ఉన్న ఈ తాబేలు పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బుర్ధ్వాన్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని ఓ చెరువులో ఈ పసుపు వర్ణం తాబేలు సూర్యకాంతులు పడినవేళ మిలమిల మెరుస్తూ స్థానికులు కంటపడింది. ఈ క్రమంలోనే ఆ పసుపు వర్ణం తాబేలు బయటకు రావడంతో స్థానికులు దానిని రక్షించి అటవీశాఖ అధికారులకు దీని గురించి తెలియజేశారు.
అక్కడికి వెంటనే చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ అరుదైన పసుపు రంగు తాబేలును సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ తాబేలు గురించి బుర్ధ్వాన్ సొసైటీ ఫర్ ఎనిమల్స్ వెల్పేర్ సభ్యులు అర్నాబ్ దాస్ మాట్లాడుతూ.. ఈ పసుపు వర్ణం తాబేలు అత్యంత అరుదైనవనీ, దీని శరీరంలోని మొత్తం భాగం ( తల, చర్మం, కాళ్లు, దానిపై ఉన్న రక్షణ కవచం) పసుపు రంగులోనే ఉంటుందనీ, ఇది అల్బినో జాతికి చెందినదని వివరించారు. ఈ ఏడాది జులైలోనూ ఒడిశాలోని బాలాసోర్లోనూ అరుదైన పసుపు వర్ణం తాబేలు కనిపించింది. అయితే కొందరు ఈ తాబేళ్లు కనిపిస్తే చేడు జరగబోతుందని అర్థం అని అంటున్నారు. మరి అందులో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం ఈ తాబేలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.