Sudigali Sudheer: బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జంట సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీ. జబర్దస్త్ షో ద్వారా వీరిద్దరూ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకునే రీతిలో పంచ్ డైలాగులతో నవ్విస్తూ కవ్విస్తూ అలరిస్తూ ఉంటారు. ఒక్క జబర్దస్త్ షోలో మాత్రమేకాక చాలా షోల లో ఇద్దరు రాణిస్తున్నారు. వీళ్లిద్దరు గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు ఎప్పటి నుండో కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రకరకాల గాసిప్స్ ఎప్పటినుండో వినిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో తాజాగా సుడిగాలి సుధీర్ పై రష్మీ చేసిన రీసెంట్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే “ఎక్స్ ట్రా జబర్దస్త్” లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో రష్మీ సుధీర్ పై పంచ్ లు వేయడం జరిగింది. సుడిగాలి సుదీర్ ఈ.ఎం.ఐలు వసూలు చేసే ఉద్యోగిగా వచ్చి పొట్టి నరేష్ టీవీకి కట్టాల్సిన ఈ.ఎం.ఐలు గురించి ప్రశ్నిస్తాడు.
Read More: Sudigali Sudheer : ప్రియమణి డ్యాన్స్ చూసి ఆగలేక సుడిగాలి సుధీర్ ఏం చేశాడో చూడండి?
వెంటనే నరేష్ మా ఇంట్లో బాదంపాలు బాగుంటాయని.. లేడీ గెటప్ లో ఉన్న బుల్లెట్ భాస్కర్ చేత బాదంపాలు తీసుకొస్తాడు వెంటనే సుధీర్ ని చూసి బుల్లెట్ భాస్కర్ ఎవరు ఇతడు అని ప్రశ్నించగా వెంటనే పక్కనే యాంకర్ స్థానంలో ఉన్న రష్మి సొరంగాలలో నుండి తవ్వుకుంటూ వచ్చేశాడు అంటూ సుధీర్ పై పంచ్ డైలాగ్ వేయటం జరుగుతుంది. జూన్ 4వ తారీఖు ప్రసారమయ్యే ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.