చదువులో మొదటి ర్యాంకు రాణించిన వారికి లేదా ఆటలలో ప్రథమ స్థానం సంపాదించిన వారికి లేదా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసిన వారికి బంగారు పతకాన్ని ఇస్తారు. అయితే బంగారు పతకాన్ని ఒక ఎలుక గెలుచుకోవడం విన్నారా? ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆఫ్రికన్ కు చెందిన మగువా అనే ఎలుక ల్యాండ్ మైనింగ్ లను గుర్తించినందుకుగాను బంగారు పతకాన్ని అందించారు. పూర్తి వివరాలలోకి వెళితే…
కొన్ని దశాబ్దాల నుంచి ఆగ్నేయాసియా దేశంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో ల్యాండ్ మైండ్ లను, పేలుడు యుద్ధ అవశేషాలతో నిండిపోయింది. వీటి ప్రభావం ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ల్యాండ్ మైండ్ లను కనిపెట్టడం ఎంతో కష్టంతో కూడిన పని కాబట్టి మగువా అనే ఎలుకకు యాంటీ పర్సూన్స్మిజ్నెన్ ఓంట్మిజ్నెండే ప్రొడక్ట్ ఒంట్విక్కెలింగ్ ద్వారా శిక్షణ కల్పించారు. ఈ శిక్షణలో భాగంగా ఎలుకకు ల్యాండ్ మైనింగ్ లో ఉపయోగించే పేలుడు పదార్థానికి వాడే రసాయనాల వాసనను గుర్తించడానికి, బెల్జియం లోని టాంజానియా ప్రధాన కార్యాలయం ఇటువంటి ఎలుకలకు శిక్షణ ఇస్తుంది.
మగువా ఎలుక ఏడు సంవత్సరాలలో 39 ల్యాండ్ మైండ్ లను, 28 పేలుడు బాంబులను కనిపెట్టింది. ఇందుకుగాను బ్రిటిష్ వెటర్నరీ చారిటీ పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ యానిమల్స్ మగువా ఎలుకకు బంగారు పతకాన్ని అందించింది. ఈ ఎలక ఒక హీరో, ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఈ ఎలుకకు బంగారు పతకాన్ని ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, పిడిఎస్ ఏ డైరెక్టర్ జనరల్ జాన్ మేక్లౌగ్లిన్ మెడల్ వర్చువల్ ప్రజెంటేషన్ లో చెప్పారు.
మగువా చిన్నతనం నుండే శిక్షణ తీసుకోవడం వల్ల, ఇంతటి ప్రమాదకరమైన ల్యాండ్ మైనింగ్ లను గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడింది. మెటల్ టిటెక్టర్ ఉపయోగించి ఒక టెన్నిస్ కోర్ట్ పరిమాణాన్ని క్లియర్ చేయడానికి మనుషులకు దాదాపు నాలుగు రోజుల సమయం పడుతుంది. కానీ మగువా మాత్రం 30 నిమిషాలలో క్లియర్ చేస్తుందని చెప్పారు.