బుల్లితెరపై పండగ వాతావరణం మామూలుగా ఉండదు. స్పెషల్ ఈవెంట్లు ప్రతి ఇంట్లో ఒక వాతావరణాన్ని తీసుకొస్తాయి. ఇది ప్రతి సంవత్సరం ఉండేదే. ఈ సంక్రాంతికి ఈటీవీ లో ‘అత్తో అత్తమ్మ కూతురో’ అనే స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. స్టార్ మా లో ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అనే స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. ఇక ప్రస్తుతం ఈ టీవీ కి సంబంధించిన ఈవెంట్ ప్రోమో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
జబర్దస్త్ టీం చేసే పర్ఫార్మెన్స్ మొత్తం ఈ సారి హైలైట్ గా నిలవనున్నాయి. ఇక స్పెషల్ అట్రాక్షన్ గా రవి లాస్య కూడా వీరికి తోడు కానున్నారు అని అర్థమవుతోంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఒకే స్టేజి పైన కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలు, పెరిగిన దూరం కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి జంట అంటే ఒకప్పుడు భారీ క్రేజ్ ఉండేది. అయితే ఇద్దరు విడిపోయాక రవి అలాగే కొనసాగాడు. లాస్య స్థానంలో శ్రీముఖి, వర్షిని, భాను శ్రీ అని చాలామంది వచ్చారు కానీ వారి మ్యాజిక్ ను మాత్రం రిపీట్ చేయలేకపోయారు.
ఇక ఐదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈవెంట్ లో తాజాగా ఒక ప్రోమో రిలీజ్ చేశారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు మరిచిపోయినట్టు చూపించారు. ఇంతకు ముందు ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే క్షమించు అని రవి అందరిముందే లాస్యను అడిగేసాడు. మొత్తానికి మళ్లీ ఈ హిట్ జంటను ఇలా చూడడంతో అందరి చూపు వీరి పైనే పడింది. పైగా ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్, అతని తల్లి కూడా ఉండబోతున్నారు.