రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది.. ఆర్బీఐ ట్విట్టర్ అకౌంట్ 10 లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకుంది.. ప్రపంచంలో మరే ఇతర కేంద్ర బ్యాంక్కు కూడా ఇంత మంది ఫాలోవర్లు లేకపోవడం గమనార్హం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కేంద్ర బ్యాంకులైన యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ను ట్విట్టర్లో విస్తృత తేడాతో ఓడించింది, మైక్రోబ్లాగింగ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కేంద్ర బ్యాంకుగా నిలిచి సరికొత్త రికార్డ్ సృష్టించింది. “ఆర్బీఐలోని నా సహచర ఉద్యోగులందరికీ అభినందనలు” అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ట్వీట్ చేశారు.
రెండేళ్లలోనే డబల్ కంటే ఎక్కువ :
భారతీయ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ 2012లో ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ట్విట్టర్ ఖాతాని అనుసరించేవారు ప్రారంభంలో తక్కువగా ఉండేవారు. మార్చి 2019 – 2020 ఈ ఏడాది కాలంలో అనుసరించేవారి సంఖ్య 3.42 లక్షల నుంచి 7.50 లక్షలకు చేరింది. అంటే రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. లాక్ డౌన్ తర్వాత ఈ ట్విట్టర్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య ఏకంగా 1.5 లక్షలకు పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-2021లో 2.50 లక్షల మంది కొత్తగా ఈ అకౌంట్ను ఫాలో అవుతున్నారు. గత సెప్టెంబర్ 27వ తేదీ నాటికి 9.66 లక్షలుగా ఉండగా. ఈ ఆదివారం (నవంబర్ 22) నాటికి 10 లక్షల మైలురాయిని దాటింది. ట్విట్టర్ ఖాతాలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆర్బీఐ 85 ఏళ్లుగా సేవలు అందిస్తుంది.
ప్రపంచ కేంద్ర బ్యాంకుల విషయానికి వస్తే ..
1 మిలియన్ ఫాలోవర్లతో ఆర్బీఐ మొదటి స్థానంలో ఉండగా. మెక్సికోకు చెందిన బాన్కో డి మెక్సికో రెండో స్థానంలో ఉంది. దీనికి ఫాలోవర్లు 7.7 లక్షలమంది ఉన్నారు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండోనేసియా మూడో స్థానంలో కొనసాగుతోంది. దీనికి ఫాలోవర్లు 7.5 లక్షల మంది ఉన్నారు.
అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ అమెరికా ఫెడరల్ రిజర్వుకు ట్విట్టర్ ఫాలోవర్లు 6.7 లక్షల మంది ఉన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కు 5.9 లక్షల మంది ఫాలోవర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్కు 3.8 లక్షల మంది ఫాలోవర్లు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు 3.1 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ప్రస్తుతం ఆర్బిఐ ఖాతాను ప్రపంచవ్యాప్తంగా 10,00,513 మంది అనుసరిస్తున్నారు. ప్రధాన ట్విట్టర్ ఖాతాతో పాటు, ఆర్బిఐకి ‘ఆర్బిఐ సేస్’ అనే మరో ట్విట్టర్ ఖాతా కూడా ఉంది, ఇది సామాన్యులను చేరుకోవడానికి వినియోగిస్తుంది. ఏప్రిల్ ప్రారంభంలో అదే పేరుతో ఫేస్బుక్ పేజీని కూడా ప్రారంభించింది. మోసపూరితమైన ఖాతాదారులను మోసగాళ్ళ నుండి మోసగించకుండా నిరోధించడానికి ఇది కస్టమర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.