#RC15:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాని #RC15 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయికి చేరాయి.. తాజాగా ఈ సినిమాకి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..!! అలాగే తమన్ అతని టీమ్ 135 మంది కలసి కంపోజ్ చేసిన స్నీక్ పిక్ ను పోస్ట్ చేశారు..!!
అలా వైకుంఠపురం వంటి అద్భుతమైన సౌండ్ ట్రాక్ ని అధిగమించిన తమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు అన్న విషయం మెగా అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.. ఇప్పటికే ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించారు.. ఈ సినిమాకు సంబంధించిన తారాగణం ఇతర సిబ్బందిని ఎంపిక చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. మరో వైపు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఎవరు నటించనున్నారని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.. ఇందులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా అలియా భట్, కియారా అద్వానీ, పూజా హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. మరి నిర్మాతలు, రామ్ చరణ్ ఎవరిని ఎంపిక చేస్తారు తెలియాల్సి ఉంది. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఈ సినిమా థియేటర్లలో రచ్చ రచ్చ ఖాయం..
It gets bigger and better as Music Sensation @MusicThaman joins #RC15
Here’s a sneak peek into the first recording by Thaman and a team of 135 musicians who left @ShankarShanmugh and @AlwaysRamCharan mesmerized.@SVC_official #SVC50 pic.twitter.com/dJVrVKKKbl
— Vamsi Kaka (@vamsikaka) July 19, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?