పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదంగా ఉంటాయి.. మరికొన్ని పవన్ కళ్యాణ్ ను ఇరుకున పడేస్తూ కూడా ఉంటాయి. పవన్ తో విడిపోయాక తన కొడుకు అకీరా నందన్ తో మహారాష్ట్రలోని పూణే లో నివాసం ఉంటున్న ఆమె గత కొంత కాలంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. తన పిల్లలు, అకీరా, ఆద్య లతో, తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న రేణు దేశాయ్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
అల్లు అరవింద్ కు చెందిన ‘ఆహా’ ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి ఈ మాజీ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘ఆహా వారు నిర్మించే ఓ వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫారం లో విడుదల కానుండగా…. వారు చెప్పిన కథ నచ్చడంతోనే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు రేణుదేశాయ్ ఓకే చెప్పినట్లు సమాచారం. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రస్తుతం రేణుని మాత్రమే క్యాస్ట్ చేసినట్లు…. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి అని అంటున్నారు.
ఇకపోతే ఈ మధ్యన అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య సఖ్యత లేదన్నది అందరిమాట. వీరిద్దరి మధ్య సరిగ్గా పొసగడం లేదని కొద్దిరోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మెగా కాంపౌండ్ వీరాభిమానులు కూడా వీరి మధ్య విబేధాలు ఉన్నట్లు చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు అల్లు అరవింద్ కు చెందిన డిజిటల్ ప్లాట్పామ్ లో నటించడం పవన్ కు కొంత వరకు ఇబ్బందే అని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ లో రేణు దేశాయ్ నటిస్తుందన్న వార్తలు సోషల్ మీడియా ద్వారా లీక్ అయినప్పటి నుండి పవన్ అభిమానులకు ఆమె ఆ సీరీస్ లో నటించడం తమకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో కూడా ఆమెకు తెలియజేస్తున్నాడు. ఇక వీరి మాటలను పట్టించుకుంటుందా? అనుమానమే….