Revanth reddy: అంచనాలు నిజం చేస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని సొంతం చేసుకున్న ఎంపీ రేవంత్రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. రేవంత్ కు పదవి నేపథ్యంలో ఆదిలో పలువురు నేతలు అప్ సెట్ అయ్యారు. అయితే, పార్టీలో అసంతృప్తలందరినీ బుజ్జగించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. రేవంత్ పేరు ప్రకటించినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలంతా ఇప్పుడు అలక వీడారు. ఇలా లెక్కలన్నీ సరి చేసుకున్న తర్వాత రేవంత్ పగ్గాలు చేపట్టనున్నారు. అనంతరం గాంధీభవన్ ఆవరణలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More: Revanth Reddy: కేసీఆర్ నీటి ఎత్తుగడకు అప్పుడే కౌంటర్ రెడీ చేసిన రేవంత్
తగ్గేదే లే….
పీసీసీ బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో ఉదయం పెద్దమ్మతల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. రేవంత్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గాంధీభవన్ సుందరీకరణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్న తర్వాత భారీ సభ నిర్వహించనున్నారు. రేవంత్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి..లక్షకుపైగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.
Read More: Revanth Reddy: షర్మిల పార్టీని బలహీనం చేసే పనిలో రేవంత్?!
సీనియర్లంతా హాజరు…
రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మాణిక్యం ఠాగూర్ వంటి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే అందరు సీనియర్ నేతల్ని కలిసిన రేవంత్ వారిలో అసంతృప్తిని దూరం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు వివిధ మీడియా సంస్థల అధిపతులను సైతం కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. మొత్తంగా నేతలందరినీ సెట్ చేసిన తర్వాతే పదవీ బాధ్యతలు చేపట్టడం ద్వారా రేవంత్ అసంతృప్తులను దూరం చేసేందుకు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.