Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మునుపటి కంటే ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి ఈ క్రమంలో ఇటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అటు పార్టీని మరింత చురుగ్గా మార్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఒరవడిలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీపై స్పందిస్తూనే మరోవైపు అధికారుల గురించి సైతం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఓ సంచలన ప్రకటన సైతం ఆయన చేశారు.
Read More: Revanth Reddy: కాంగ్రెస్లో శత్రువులను పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి
రేవంత్ కలకలం…
రాష్ట్రంలో ఎప్పటికీ కేసీఆరే సీఎంగా ఉండబోని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, హ్యాకర్లను పెట్టి మరీ ఫోన్లు రికార్డ్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన చలో రాజ్భవన్ నిరసన కార్యక్రమం సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ‘‘ప్రభాకర్ గుర్తు పెట్టుకో బిడ్డ.. నువ్వు రాసుకో.. ఇదే పోలీసులను నీ ఇంటికి పంపించి బయటకు గుంజుకొస్తం. ఇక నుంచి లెక్కలేసుకో.. ఎప్పటికీ సీఎంగా కేసీఆరే ఉండడు. గోడ మీద గీతలు గీసుకో.. 730 రోజుల్లో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్ గడీలను కూల్చి మీ సంగతి తేలుస్తం.. వచ్చేది సోనియమ్మ రాజ్యమే” అని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ సర్కారు ఉండేది మరో రెండేళ్లు మాత్రమేనని రేవంత్ అన్నారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఆయనను హోంగార్డులను పంపించి అరెస్ట్ చేయిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More: Revanth Reddy: రేవంత్ పై అదిరిపోయే కామెంట్ చేసిన హరీశ్
రేవంత్ ఏమంటున్నారంటే…
హైదరాబాద్ లోని కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని తెలిపారు. వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ బంధువులు, సన్నిహితులే తక్కువ ధరకు భూములు కొనుక్కున్నారని చెప్పారు. శనివారం అన్ని వివరాలు బయటపెడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?