Krishnapatnam Corona Medicine: ప్రపంచాన్ని అతలాకుతలం చేసి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ కి ఇప్పటివరకు సరైన మెడిసన్ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ప్రపంచంలో పెద్దపెద్ద యూనివర్సిటీలు ప్రయోగశాలలు కూడా ఈ వైరస్ ముందు తలవంచేశాయి. అటువంటి ప్రమాదకరమైన ఈ మహమ్మారి వైరస్ కి మన తెలుగు వాడు నెల్లూరు జిల్లాకు కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య నాటు మందు కనిపెట్టడం ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ వార్తలు విని జీవితాలు మీద ఆశలు వదిలేసుకున్న మనిషి ఇప్పుడు ఆనందయ్య కనిపెట్టిన మందు గురించి వార్తలు విని .. జీవితం పై ఆశలు పెట్టుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందు పరిశీలించడానికి ఐసీఎంఆర్ బృందాన్ని పంపడం జరిగింది. అదే రీతిలో ఆనందయ్య కి వై కేటగిరి భద్రత కేటాయించింది. ఇలాంటి తరుణంలో కాంట్రవర్సి కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆనందయ్య గురించి సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేశారు.
“ ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణ పట్టణానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డా. పౌజి వెళ్తున్నారని విన్నాను. ఆనందయ్య కరోనా రెసిపీ కోసం డీల్ కుదుర్చుకోవడానికై అయ్యుండొచ్చు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్న. ఆనందయ్య ను జాతీయ సంపదగా గుర్తించి, మిలటరీ భద్రత కల్పించవచ్చు కదా అంటూ సరదాగా ఆర్జీవి కామెంట్ పెట్టారు. మరోపక్క సోషల్ మీడియాలో సామాన్య నెటిజన్లు కూడా మెడికల్ మాఫియా వాళ్ళ ఆనందయ్య కు ప్రమాదం ఉండవచ్చు, ఆయనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఆనందయ్యకు “వై” క్యాటగిరి భద్రతా కల్పించింది.