Rice Cream: ముఖం పై మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, ముడతలు ముఖాన్ని కాంతివిహినంగా చేస్తుంది.. మీ మోముకు మెరుగులు దిద్దడానికి మార్కెట్లో లభించే రకరకాల క్రీములను ప్రయత్నించి ఉంటారు..!! వాటి బదులుగా మన ఇంట్లోనే రైస్ క్రీమ్ తయారు చేసుకుని వాడితే వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చు..!! రైస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలంటే..!?
రైస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల బియ్యం వేసుకొని నిండా నీరు పోసి రెండు గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తరువాత ఒక మిక్సీ జార్లో బియ్యం నీటిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టలి. ఒక గిన్నెలో ఈ రైస్ నీటిని పోసి స్టవ్ ఆన్ చేయాలి. క్రీమ్ దగ్గర పడే అంతవరకు తిప్పుతూ ఉండాలి. ఇలా రైస్ క్రీమ్ తయారు చేసుకోవాలి.
రెండు స్పూన్స్ రైస్ క్రీమ్, ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ బాదం ఆయిల్, ఒక స్పూన్ చందనం పొడి, ఒక స్పూన్ తేనె వేసి కలిపి అన్నింటిని కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకునే ముందు గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ప్యాక్ వేసుకుని అర గంట తర్వాత కడిగేసుకోవాలి. ప్రతిరోజు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ముడతలు తగ్గుతాయి. మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది.