Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నీ చంపేస్తామని ఇటీవల ఆయన తండ్రి సలీమ్ ఖాన్ కి అగంతకులు లెటర్ పంపించడం తెలిసిందే. దీంతో సల్మాన్ కుటుంబ సభ్యులు ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా నీ హతమార్చిన రీతిలో సల్మాన్ నీ చంపేస్తామని ఆ లెటర్ లో రాసినట్టు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో వస్తున్న వార్తలపై సల్మాన్ ఖాన్ రీసెంట్ గా రియాక్ట్ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మేటర్ లోకి వెళితే ఇటీవల సల్మాన్ మరియు ఆయన తండ్రి సలీమ్ ఖాన్ ముంబై పోలీసులను ఆశ్రయించి.. స్టేట్మెంట్ ఇస్తున్న సమయంలో తనకి ఎటువంటి బెదిరింపు..లేఖలు… ఫోన్ కాల్స్ రాలేదని చెప్పటం జరిగిందట. దీంతో ఇదొక పెద్ద ట్విస్టు లాగా మారింది. ఇక ఇదే సమయంలో గ్యాంగ్ స్టార్ లారెన్స్ బీష్ణోయ్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. పంజాబ్ సింగర్ మూసే వాలా హత్య కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బీష్ణోయ్..నీ ఈ లెటర్ విషయంలో తాజాగా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించడం జరిగింది అంట.
సల్మాన్ ఖాన్ కి బెదిరింపు లేఖ విషయంలో తనకు ఏమి సంబంధం లేదని.. ఎవరు లెటర్ ఇచ్చారో కూడా తనకు తెలియదని బీష్ణోయ్ స్పష్టం చేశారు. దీంతో గత మూడు రోజుల నుండి సల్మాన్ ఖాన్ పై హత్య యత్నం అంటున్న వస్తున్న వార్తలకు.. తాజా పరిణామాలతో చెక్ పెట్టినట్లు అయింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కొత్త సినిమాకి సంబంధించి షూటింగ్ కోసం హైదరాబాద్ కి రావడం జరిగింది. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. “కబీ ఈద్ కబీ దీవాలి” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇదే సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర చేస్తున్నారు.