మోడలింగ్లో కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత 2007లో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోమిన్ కావేరీ సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టి.. ఏం మాయా చేశావే అంటూ తెలుగు తెరకు పరిచయమై.. తక్కువ కాలంలోనే తెలుగు, హింది, తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కథనాయకి సమంతకు ఆనందం అంటే ఇదే అని చెబుతున్నది. లాక్డౌన్ కారణంగా మనసుకు అమితమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విషయం గురించి తెలుసుకున్నానని అంటోంది ఈ కుందనపు బొమ్మ! అదేంటో మనం తెలుసుకుందామా..
సినిమాలు, వాటి కోసం కష్టపడి పని చేయడం, దాని ద్వారా లభించిన విజయాలు మాత్రమే తనకు ఆనందం, సంతోషం కలిగించడంతో పాటు, స్పూర్తిని నింపుతాయని ఇన్ని రోజులు భావించిందట సమంత. అయితే, కరోనా పుణ్యమా అని సమంతకు ఆసలైన ఆనందం, స్పూర్తిని కలిగించే విషయాలు చాలానే ఉన్నయని తెలిసిందట ! ఈ విషయం గురించి తాజాగా సమంత పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో తనకు సినిమాల నుంచి విరామం లభించిందని తెలిపింది.
మొక్కలు పెంచడం తనకు చాలా ఇష్టమనీ, సినిమాల బిజీలో మొక్కలు పెంచడం కోసం తనకు సమయం దొరకలేదని ఈ ‘’ ఓ బేబీ‘’ చెప్పింది. ప్రస్తుతం లభించిన ఈ సమయంలో మొక్కలు పెంచుతున్నానని తెలిపింది. తమ ఇంటిపై కూరగాయాల మొక్కలు పెంచుతూ.. ఆరోగ్యకరమైన ఆహారం వివరాలను వెల్లడిస్తూ.. తన రూఫ్ గార్డెన్ ముచ్చట్లు చెప్పింది. మొక్కలు, పెంచడంతో పాటు కుటుంబ అనుబంధాలే అమితమైన ఆనందం, సంతోషాన్ని కలుగుజేస్తాయని తెలిపింది ఈ కుందనపు బొమ్మ.
తెలుగు సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత.. యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగచైతన్యను ప్రేమ పెళ్లి చేసుకున్న సమంతా.. ఇప్పటికీ సినిమాలల్లో కొనసాగుతున్నది. సినిమాలతో పాటు పలు బిజినెస్లను కూడా ఆమె ప్రారంభించింది. ఇప్పటికే స్నేహితులతో కలిసి ప్రీ స్కూల్ నడుపుతున్న సమంతా.. సాక్షి వరల్డ్ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, సమంత ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!