SBI Offer: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపింది.. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం లో భాగంగా అకౌంట్స్ ఓపెన్ చేసిన వారికి ఈ అవకాశం వర్తిస్తుంది. మీకు ఎస్బిఐ లో సేవింగ్స్ ఖాతా ఉందా అయితే మీకు బంపర్ ఆఫర్.. ఎస్బిఐ లో ఎకౌంటు నుండి అక్కడే జన్ ధన్ ఖాతా తెరిచినట్లయితే మీరు అక్షరాల లక్షాధికారి అయినట్టే.. అదెలా అనుకుంటున్నారా.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..!!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జన్ ధన్ ఖాతాదారులకు రూ.2,00,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు ఈ విషయాన్ని తన వినియోగదారులకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఎస్బిఐ రూపాయ్ కార్డు ను జన్ ధన్ ఖాతాదారులకు అందిస్తోంది. ఈ కార్డు వినియోగదారులకు రెండు లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ సౌకర్యాన్ని అందిస్తోంది. రూపే కార్డు మీ ఏటీఎంల కార్డుల పనిచేస్తుంది. ఈ కార్డు తో ఎకౌంట్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు, అలాగే షాపింగ్ కూడా చేయవచ్చు. ఎస్బిఐ రూపే కార్డు కోసం దరఖాస్తు చేస్తే మీకు రెండు లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుందని ట్విట్టర్ ద్వారా ఎస్బిఐ తెలిపింది. అంతేకాకుండా రూపే కార్డు సౌకర్యాలను వినియోగదారులకు ఫ్రీగా ఇస్తుంది.
రూపే కార్డ్ ప్రయోజనాలు..!!
*ఇందులో యాక్సిడెంటల్ బీమాకు రూ.2 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది.
* ఆరు నెలల తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది.
* ఫ్రీ మొబైల్ బ్యాంకింగ్, డిపాజిట్లపై వడ్డీ ఇస్తుంది.
*ఈ డెబిట్ కార్డ్ తో డబ్బులు డ్రా చేయవచ్చు, షాపింగ్ చేయవచ్చు.
* దేశవ్యాప్తంగా నగదు బదిలీ చేసుకోవచ్చు.
*ప్రభుత్వ పథకాల ప్రయోజనాల డబ్బు నేరుగా ఖాతాల్లోకి జమ అవుతుంది.
* జన్ ధన్ ఖాతా ద్వారా పెన్షన్, భీమా డబ్బులు అందుకోవడం సులువు.