Afghanisthan: దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం దక్కించుకున్న తాలిబాన్ లు.. గతంలో మాదిరి గానే రూల్స్ పెడుతున్నారు. ఆడవాళ్లు బయటకు రాకూడదని చదువుకో కూడదని.. అప్పటి చట్టాలను మళ్లీ అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో పాఠశాలల వద్ద ఉగ్రవాదుల దాడులు పెచ్చుమీరు పోతున్నాయి. దుండగులు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ ఉండటంతో విద్యార్థులకి రక్షణ లేకుండా పోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా రాజధాని కాబూల్ లో రెండు పాఠశాలలపై దుండగులు దాడి చేయడంతో… పది మందికి పైగా విద్యార్థులు మరణించడం జరిగింది. రెండు ఐఈడీలతో… ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. షియా హజారా అనే మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంనీ కావాలని లక్ష్యంగా చేసుకుని… ఐఏఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత ఏడాది మేలో కూడా ఇదే ప్రాంతంలో ఓ పాఠశాల పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డగా 85 మంది మరణించగా 300 మంది గాయపడ్డారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చనిపోయిన వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. ఇటువంటి తరుణంలో లో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో రక్త పాతం మరియు ఉగ్రవాదం పెరుగుతూ ఉండటంతో… అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. గతంలో మాదిరిగానే ఆఫ్ఘనిస్తాన్లో మహిళలకు తాలిబాన్ లు.. కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో పాఠశాలలపై ఐఏఎస్ ఉగ్రవాదులు దాడులకు ఎక్కువ పాల్పడటం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. తాజాగా జరిగిన పేలుడు ధాటికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.