ప్రముఖ ఓటీటీ ఆహాలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ “AAS” అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో షణ్ముఖ్ కి తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడటానికి ప్రధాన కారణం “సూర్య” వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ తేరకెక్కించిన దర్శకుడు సుబ్బు రాసిన ఏజెంట్ ఆనంద సంతోష్”AAS” స్టోరీని అరుణ్ పవర్ డైరెక్ట్ చేయడం జరిగింది. తాజాగా “AAS” టీజర్.. రిలీజ్ అయింది. చాలాకాలం తర్వాత షణ్ముక్ కి సంబంధించి టీజర్ విడుదల కావటంతో సోషల్ మీడియాలో “AAS” వైరల్ అవుతుంది.
కామెడీ నేపథ్యంలో.. సస్పెన్స్ థ్రిల్లర్ గా “AAS” తేరకెక్కినట్లు టీజర్ బట్టి తెలుస్తోంది. టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి “AAS” టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. కొద్దిగా అమాయకంగా కూర్చుని.. నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్. మనుషులు పోయినా లేదా సామాన్లు పోయిన వెతికి పెడతా.. అంటూ షణ్ముఖ్ టీజర్ లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకొంది.
బిగ్ బాస్ సీజన్ 5 లో రన్ రప్ గా షణ్ముఖ్ గెలవడం తెలిసిందే. కానీ ఆ షో ముగిశాక మనోడు ఆడిన ఆట తీరుకి బాగా నెగిటివిటి బయటకు వచ్చాక ఎదుర్కోవటం జరిగింది. అదే సమయంలో దాదాపు 5 సంవత్సరాలు ప్రేమలో ఉన్న దీప్తి సునయన కూడా బ్రేకప్ చెప్పేయడం జరిగింది. దీంతో చాలాకాలం అజ్ఞాతంలో ఉన్న షణ్ముఖ్.. ఇప్పుడు “AAS” టీజర్ తో ముందుకు రావడంతో..షణ్ముఖ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. “AAS” టీజర్ నీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు విడుదల చేసిన టీజర్ లో స్పష్టం చేశారు.