యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతదేశపు మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ‘బాహుబలి’ తో అవతరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘సాహో’ సినిమాతో కూడా దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో కలెక్షన్లు రాబట్టి అన్నీ సినీ ఇండస్ట్రీ లకు మతి పోగొట్టేశాడు. ఇప్పుడు అదే వరుసలో ప్రభాస్ తన కెరీర్లో మరో బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ తో ముందుకు వచ్చాడు. ‘ఆదిపురుష్’ చిత్రంతో అతను మరొక పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అనే ఒక సంచలనాత్మక ట్యాగ్ లైన్ తో ‘ఆదిపురుష్’ టైటిల్ పోస్టర్ ను మొన్ననే విడుదల చేశారు. ఈ చిత్రం నిజంగా టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి.
‘తన్హాజీ’ సినిమాతో బాలీవుడ్ అభిమానులను అబ్బురపరిచిన సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో షూటింగ్ జరుపుకోనుంది. టీ- సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చేశాయి. అయితే రాముడికి ఒక సీత ఉండాలి కదా. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ప్రభాస్ లాంటి కట్ అవుట్ పక్కన సీతాదేవి లో నటించే ఛాన్స్ ఏ హీరోయిన్ కి వస్తుంది అని అందరికీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక సీత పాత్ర కోసం పూజా హెగ్డే, నయనతార, అనుష్క అంటూ ఎంతో మంది పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చివరికి ఒక పన్నెండు మందిని అనుకోగా వారిలో నుండి ఒకే ఒక్క పేరు బయటకు వచ్చిందట. ఆమెనే…. జాతీయ అవార్డు గ్రహీత, ‘మహానటి’ తో ఎంతోమంది మనసులను ఆకట్టుకున్న కీర్తి సురేష్. కీర్తి సురేష్ తన అభినయంతో ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె రాముడికి సీత గా నటించనున్నారని వార్తలు రావడంతో డార్లింగ్ అభిమానులంతా ఖుషి అయిపోయారు. ప్రభాస్ 20వ సినిమా ‘రాధే స్యామ్’ కి పూజ హెగ్డే హీరోయిన్ కాగా… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!