Constable: ఓ మహిళా కానీస్టేబుల్ ఉదంతం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ఓ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ ప్రేమ పేరుతో డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి డబ్బులు దండుకుంటుంది , తాజాగా ఆమె మూడో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో గుట్టు రట్టు అయిందని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందని సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే, ఇందులో ఆ అమ్మాయి కంటే సదరు వ్యక్తిదే తప్పుందని తేలింది.
ప్రేమ పేరుతో మోసం
ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన తనను సదరు కానిస్టేబుల్ ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వచించి పెళ్లి చేసుకుందని చరణ్ తేజ ఆరోపించారు. ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సంధ్యారాణి గతంలో రెండు వివాహాలు చేసుకున్న విషయాన్ని దాచిపెట్టి తనను వలలో వేసుకొని ఆర్య సమాజ్లో వివాహం చేసుకుందని భర్త చరణ్తేజ డీసీపీకి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. భర్త చరణ్ తేజదే తప్పు అని తేలింది. అయితే, కానిస్టేబుల్ సంధ్యరాణి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.
భర్తను రిమాండ్ కు పంపారు..
పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు భర్త చరణ్ తేజ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కులం పేరుతో దూషించి, వేధింపులకు గురిచేస్తున్నట్లు కానిస్టేబుల్ సంధ్యరాణి ఫిర్యాదులో పేర్కొంది. ఐపీసీ 498A, 506, వరకట్న నిరోధక చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. చరణ్ తేజను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్ కి తరలించారు.