Silent Killers: మన తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే.. అయితే నేటి ఆధునిక జీవన విధానం వలన చిన్న వయసులో లోనే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.. కొన్ని వ్యాధులు చాప కింద నీరులా వ్యాపించి ప్రాణాలు హరిస్తున్నాయి.. మరి ఇటువంటి వ్యాధుల గురించి ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి..!! మరి ఆ సైలెంట్ కిల్లర్స్ వ్యాధులెంటో ఇప్పుడు చూద్దాం..!!
డయాబెటిస్ ప్రతి పది మందిలో ఏడుగురికి ఈ వ్యాధి ఖచ్చితంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గుల కారణంగా ఈ ఆరోగ్య సమస్య వస్తుంది. మధుమేహం వచ్చే ముందు తరచుగా మూత్రం కు వెళ్ళడం, మూత్ర ఇన్ఫెక్షన్స్, గొంతు పొడిబారడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, నీరసం, నిస్సత్తువ, చూపు మందగించడం, దంత సమస్యలు, ఆకలి మందగించడం, కాళ్లు తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి వీటిని ముందుగానే గుర్తించాలి. మధుమేహం ను అశ్రద్ధ వహిస్తే చూపు కోల్పోవడం, మూత్రపిండాల వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులతో పాటు అనేక దీర్ఘకాలిక సమస్యల బారిన పడేస్తుంది. ఈ సమస్యలు ఆకస్మికంగా చుట్టుముడితే ప్రాణాలు పోయే అవకాశం లేకపోలేదు.
కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇది మనకు వచ్చే గుండెజబ్బులలో ఒకటి. గుండెకు రక్తాన్ని ఆక్సిజన్ను సరఫరా చేసే కరొనరీ ధమనులు కుంచించుకు పోవడం వలన ఈ సమస్య వస్తుంది దీనివలన గుండె పోటు వస్తుంది. ఈ సమస్యకు గురైతే ప్రాణాపాయం కావచ్చు. ఆస్టియోపొరోసిస్ అనేది ఎముకల వ్యాధి ఈ సమస్య వస్తే ఎముకలు పెళుసుగా మారిపోయే త్వరగా విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న దెబ్బలు కూడా బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. అధిక రక్తపోటు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది అయితే ఈ సమస్యను మాత్రం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?