Singareni: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పగిడెరు గ్రామ పరిధిలో కొన్ని సంవత్సరాలుగా భూమి నుంచి వేడి నీరు ఉబికి వస్తుంది.. సింగరేణి ఎక్స్ ప్లోరేషన్ విభాగం బొగ్గు నిక్షేపాలను అన్వేషిస్తూ ఉండగా ఈ విషయం కనుగొన్నారు.. మోటార్ అవసరం లేకుండా సంవత్సరాల తరబడి వేడినీరు వందల అడుగుల నుంచి ఉబికి వస్తుండడంతో.. ఈ నీటి ఆవిరి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు నిర్ధారించారు..!! సింగరేణి తన జియో ధర్మ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది..!!
Read More: Pooja Hegde: పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు హండ్రెడ్ మిలియన్ వ్యూస్..!!
ఎటువంటి ఇంధనం అవసరం లేకుండా కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇందుకోసం కేంద్ర బొగ్గు శాఖ రూ.1.72 కోట్లు మంజూరు చేసింది.. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ లో కొంత భాగాన్ని పరిసర ప్రాంత గ్రామాల్లోని పంట భూముల కోసం ఇవ్వడానికి సింగరేణి ఒప్పుకుంది.. వేడి నీటి ఆవిరి యంత్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ARC అనే టెక్నాలజీ ద్వారా పర్యావరణానికి ఎటువంటి హానీ కలగచేయకుండా మొదటిసారిగా విద్యుత్ను ఉత్పత్తి చేసి సింగరేణి రికార్డు క్రియేట్ చేయనుంది. ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు దీనిపై సర్వే నిర్వహించారు. 480 కిలోమీటర్ల లోతులో సుమారు 51 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్లు సింగరేణి సంస్థ శ్రీ రామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ సంస్థతో 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే సింగరేణి ఈ ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.