Singer Sunitha : సింగర్ సునీత ఇటీవల బిజినెస్ మాన్ రామ్ ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తూ ఉంది. తన రెండో పెళ్లి గురించి .. భర్త రామ్ గురించి అనేక విషయాలు గత కొంత కాలం నుండి టెలివిజన్ రంగంలో మరియు కొన్ని వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ చెబుతూ ఉంది. ఎప్పటినుండో ఇద్దరి మధ్య చాలా సంవత్సరాల నుండి పరిచయం ఉందని, సరిగ్గా లాక్ డౌన్ సమయంలో రామ్ తనని పెళ్లి చేసుకోవడానికి ప్రపోజ్ చేయడం జరిగిందని సునీత ఇటీవల వాలెంటైన్స్ డే నాడు తెలపటం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం రెండవ వివాహ జీవితం చాలా సంతోషంగా నడుస్తున్నట్లు తన మనసులో భావాలను కొత్త జీవితం గురించి చెప్పుకొచ్చింది. వివాహమైన వెంటనే సరదాగా వెకేషన్ కూడా వెళ్లినట్లు సింగర్ సునీత తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్ కార్యక్రమం కోసం తాజాగా సింగర్ సునీత ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం ఓ రిసార్టులో జరిగింది. అయితే ఆ రిసార్టులో.. ఎక్కువ తాటి చెట్లు ఉండటంతో.. గీత కార్మికులు తాటికల్లు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో సరదాగా సింగర్ సునీత తో పాటు మరి కొంత మంది కళాకారులు ఫుల్లుగా తాటికల్లు గ్లాసులతో తాగారు. దీంతో సింగర్ సునీత కల్లు తాగిన ఫోటోలు, సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. సింగర్ సునీత తో పాటు కళ్ళు తీసిన కార్మికులు మరియు కళాకారులు .. సరదాగా గ్లాసులతో ఫోటోల కి ఫోజులు ఇచ్చారు.