Sirisilla Rajeswari: మనిషి శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమైనవి.. వాటిలో ఏ అవయవం లేకపోయినా మనిషి మనుగడ కష్టమవుతోంది.. అన్నీ ఉన్న కవి కావాలంటే మాత్రం స్పందించే హృదయం ఉండాలి.. అది అందరికీ సాధ్యం కాదు.. ఇప్పుడు మనం చెప్పుకొబోయే ఈ అమ్మాయి పేరు బూర రాజేశ్వరి అనేకంటే సిరిసిల్ల రాజేశ్వరి అంటే అందరూ బాగా గుర్తుపడతారు.. ఆమె పుట్టుక తోనే 2 చేతులు లేవు.. 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె నడవలేకపోవయింది.. అలానే ఆమె చింతిస్తూ కూర్చోలేదు.. కాళ్ళతోనే ఆమె అక్షరాలు రాయడం నేర్చుకుంది..!! పుస్తకాలు చదివి అలా కవితలు రాయడం కూడా ప్రారంభించింది.!!
రాజేశ్వరి సిరిసిల్లలో నివసించేది. సిరిసిల్ల అంటే నేతన్నలకు పుట్టినిల్లు లాంటిది. అక్కడ వారి మధ్య పెరిగిన రాజేశ్వరి వారి కష్టాలను కవితలుగా మలిచేది. కాళ్ళతోనే పెయింటింగ్ వేయడం కూడా నేర్చుకుంది. అలా ఆమె రాసిన కవితల్లో నుంచి 800 కవితలను మహారాష్ట్ర బోర్డు అకడెమిక్ కరికులం లో చేర్చింది. ఆమె గురించి తెలుసుకున్న కేటీఆర్ ఆమెను తెలంగాణ బోర్డు కూడా సిఫార్సు చేశారు. ఆమె రాసిన కవితలను ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు ప్రచురింప చేశారు.
ప్రస్తుతం మహారాష్ట్ర బోర్డు అన్ని కాలేజీల్లోనూ ద్వితీయ భాష తెలుగు లో ఆమె కవితల పాఠ్యాంశాలుగా చేర్చి బోధిస్తున్నారు. కేటీఆర్ కూడా ఆమె కవితలను తెలంగాణ బోర్డు లో చేర్చాలని ఆమె గురించి పాఠ్యాంశాల్లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇంత గొప్ప స్థాయికి చేరుకున్న సిరిసిల్ల రాజేశ్వరి జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొని వాటన్నింటినీ జయించి.. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది..