Marriage: పెళ్లి తో రెండు జీవితాలే కాక రెండు కుటుంబాలు ఏకమవవుతాయి.. వధువు మెడలో దండ వేశాక సైడ్ అయ్యాడు వరుడు.. వరుడు పారిపోయాడన్న విషయాన్ని గ్రహించిన వధువు తల్లిదండ్రులు.. అక్కడికి వచ్చిన బంధువులు అబ్బాయితో పెళ్లి చేసి రీట్విస్ట్ ఇచ్చారు..!!
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ చోటుచేసుకుంది. కాన్పూర్ జిల్లా, మహారాజ్ పూర్ నగరంలో లో జరుగుతున్న వివాహ వేడుకలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వధూవరులు ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. తర్వాత పెళ్లి తంతు ప్రారంభమయ్యే ముందు పెళ్ళికొడుకు పత్తా లేకుండా పోయాడు.. పెళ్లి మండపం లో వరుడు లేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వెతికారు.. పెళ్లి కొడుకు కావాలని పారిపోయాడు అని తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగకూడదని అదే పెళ్లికి వచ్చిన వారి బంధువుల అబ్బాయి పెళ్లికి చేసుకోవటానికి ముందుకు రావడంతో.. వెంటనే వారి కుటుంబ సభ్యులుతో మాట్లాడి ఒప్పించారు.. దీంతో అదే కళ్యాణ మండపంలో అదే సమయానికి పెళ్లి జరిగిపోయింది.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు పారిపోయిన వరుడి కుటుంబ సభ్యులకు రీట్విస్ట్ ఇచ్చారు.. మొత్తానికి ఆ అమ్మాయి జీవితం నవ్వుులపాలు కాకుండా నిలబడింది..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?