sonu sood: దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న సోనూ సూద్ రియల్ హీరోగా, అపర దాన కర్ణుడిగా కీర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా కరోనా వేళ బాధితుల వైద్య సేవల కోసం సోనూ సూద్ సాయాన్ని అర్జిస్తున్నారు. సోనూ సాయం అడిగిన ప్రతి వారికి లేదనకుండా సాయం చేస్తూనే ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకూ సోనూ సూద్ ను అభిమానిస్తున్నారు.
ఈ క్రమంలో సోనూ సూద్ పై అభిమానం పెంచుకున్న తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ కు చెందిన వెంకటేశ్ అనే యువకుడు ఇటీవల సోనూ సూద్ ను కలవాలని ముంబాయికి కాలినడకన బయలుదేరాడు. కాళ్లకు చెప్పులు లేకుండా వెంకటేశ్ వికారాబాద్ నుండి 700 కిలో మీటర్లు నడుచుకుంటూ ముంబాయికి చేరాడు. తన కోసం అంత సాహసం చేసిన వెంకటేశ్ ను సోనూసూద్ తన నివాసంలో కలుసుకున్నాడు. ఆ అబిమానితో ఫోటో దిగి, అతని స్థితిగతులను, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read More: Crime News: అనుమానం పెనుభూతమై..! అతను ఎంత ఘాతకానికి ఒడిగట్టాడంటే…!?
కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెంకటేశ్ అంత దూరం నడిచి రావడం పట్ల సోనూసూద్ చలించి పోయాడు. మీడియా ద్వారా వెంకటేశ్ పాదయాత్రగా వస్తున్న విషయాన్ని తెలుసుకున్న సోనూసూద్ ముంబాయి వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసినా అతను నడిచే వచ్చాడనీ, అతని అభిమానం తనను నిజంగా ముగ్దుడ్ని చేసిందని పేర్కొన్నారు సోనూ సూద్. దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దు, కష్టాలను కొని తెచ్చుకోవద్దని సోనూ సూద్ అభిమానులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Venkatesh, walked barefoot all the way from Hyd to Mumbai to meet me, despite me making efforts to arrange some sort of transportation for him. He is truly inspiring & has immensely humbled me
Ps. I, however, don’t want to encourage anyone to take the trouble of doing this, ❣️ pic.twitter.com/f2g5wU39TM— sonu sood (@SonuSood) June 10, 2021