Sonu Sood: దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయానక వాతావరణం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వల్ల ఇప్పటికే దేశంలో అనేక మంది ప్రాణాలు విడవటం మాత్రమే కాక లక్షలలో కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా బారినపడిన రోగులు ఆక్సిజన్ అందక… హాస్పిటల్స్ లో బెడ్ దొరకక.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా రోగులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో రియల్ హీరో అని గత ఏడాది నుండి… అందరి చేత అనిపించు కుంటున్న నటుడు సోను సూద్… దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి కరోనా రోగులకు బిగ్ హెల్ప్ చేయడానికి పూనుకున్నాడు.
మేటర్ లోకి వెళ్తే ఫ్రాన్స్ ఇంకా కొన్ని దేశాల సహాయం తీసుకుని ఇండియాలో కొన్ని రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని రెడీ అయ్యారు. ముఖ్యంగా కరోనా అధికంగా ఉన్న చోట…ఈ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని సోను సూద్ టీం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో దేశంలో ప్రభుత్వాలు ముఖ్యమంత్రులకు బదులు సోనూసూద్ ఒక్కడే పరిపాలిస్తే దేశంలో కరోన ఈ రీతిలో విలయతాండవం చేసేది కాదు అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా సోనూసూద్ తన సొంత డబ్బులతో అప్పట్లో వలస కూలీలను ఆదుకోని గమ్యస్థానాలకు చేర్చగా…. ఇప్పుడు దేశంలో కరోనా రోగులకు ప్రాణాలు కాపాడటానికి ముందుకు రావడంతో… ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తూ ఉండటం తో సోను సూద్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?