Sonu Sood: దేశంలో లో ఒక వైపు కరోనా విజృంభిస్తూ.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. నా దేశ ప్రజల కోసం నేనున్నాను అంటున్నాడు సోను సూద్.. సాయం కోసం ఆపన్నులు అర్ధించిన వెంటనే నేనున్నానంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తున్నాడు.. ఇటీవల ఓ ఫౌండేషన్ స్థాపించిన సోనుసూద్ దాని ద్వారా తన సహాయ కార్యక్రమాలను మరింత విస్తృతం చేశాడు.. తాజాగా ఆ ఫౌండేషన్ కు నెల్లూరు జిల్లా వరికుంటపాడు కు చెందిన యూట్యూబర్ అయినా అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి తన ఐదు నెలల పెన్షన్ డబ్బులు రూ.15,000 విరాళంగా ఇచ్చి.. చేస్తున్న ఆ సాయానికి భాగస్వామి అయింది.. ఈ విషయాన్ని సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
ఓ చిన్న గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన ఫౌండేషన్ కు రూ.15 వేల విరాళం పంపిందని.. తన వరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలు ఆమేనని ప్రశంసలు కురిపించారు.. చూడడానికి నేత్రాలు అవసరం లేదని.. ఆమె నిజమైన హీరో అని కొనియాడారు సోనూసూద్.. అనంతరం ఆమె తో ఫోన్ కాల్ మాట్లాడారు.. ఆ అభిమాని ని హైదరాబాద్ వచ్చినప్పడు తప్పక కలుస్తానని చెప్పారు.. సోనూసూద్ తో మాట్లాడటం తో నాగలక్ష్మి ఆనందానికి అవధులు లేవు..