Sonu Sood: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పనులు నటుడు సోను సూద్ చేసుకుంటూ పోతున్నారు. దేశంలో అనేక ఇండస్ట్రీలలో టాప్ హీరోలు అని తెగ గొప్పలు చెప్పుకునే వాళ్ళు.. ప్రజలకు అవసరం వచ్చిన సమయంలో… ఎవరికీ ఏది జరిగితే తమకు ఎందుకు అన్న రీతిలో వ్యవహరిస్తుంటే సోను సూద్ మాత్రం.. గత ఏడాది లాక్ డౌన్ టైం నుండి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు…ఇంకా చేస్తున్నారు.
ప్రస్తుతం ఇంకా కొనసాగిస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది జీవితాలు తల్లకిందులు అయిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో పేదవారికి సహాయం చేస్తూ మరో పక్క కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్ సప్లై అందిస్తూ అనేక ప్రాణాలను సోనూసూద్ కాపాడుతూ వస్తున్నారు. అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్ లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Read More: Sonu Sood: స్పెషల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ లతో.. సోనూసూద్ సేవలు..!!
రెండు తెలుగు రాష్ట్రాలలో మృతదేహాల సంరక్షణ కోసం డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ లను అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గ్రామాలలో ఈ బాక్సులను అందుబాటులో ఉండే విధంగా సోనుసూద్ టీం దగ్గరుండి ఏర్పాటు చేసుకుంటుంది. ఇటీవల గ్రామ సర్పంచులు.. మృతదేహాల చివరి చూపు విషయంలో ఫ్రీజర్ బాక్స్ లేక కూలిపోయి పరిస్థితి ఉండటంతో.. ఈ విషయంలో సహాయం చేయాలని కోరడంతో సోనూసూద్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలలో… ఈ టెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ లను.. అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సోను ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రావడంతో తెలుగు రాష్ట్రాలలో ప్రజలు దండం పెడుతున్నారు.