Sonu Sood : నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్న సంగతి తెలిసిందే. వలస కూలీ లను గమ్యస్థానాలకు తన సొంత డబ్బులతో చేర్చడంతో స్టార్ట్ అయిన సోనుసూద్ దాన ధర్మ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో చాలా మంది పేద విద్యార్థులను చదివించడం మాత్రమే కాకుండా మరికొంత మందికి ఉపాధి కలిగించే విధంగా సొంత డబ్బులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా ఝాన్సీ గ్రామంలో ప్రజల దాహం తీర్చే రీతిలో బోర్ వేశారు. ఆ గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కోవడమే కాక నీటి కోసం కొన్ని కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఉండటంతో..ఆ గ్రామానికి చెందిన కొంతమంది సోనూసూద్ కి తమ బాధను చెప్పుకోవటం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన సోనూసూద్ టీం ఆ గ్రామంలో బోర్ వేయించడం జరిగింది.
దీంతో ఆ గ్రామస్తులంతా సోనూసూద్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా సోనూసూద్ తెలియజేశారు. గ్రామంలో బోర్ వేస్తున్న వీడియో లో గ్రామ ప్రజలు ఆసక్తిగా నీరు పడటాన్ని చూడటం తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగించిందని..పేర్కొన్నాడు. ప్రస్తుతం సోనూసూద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు.. దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు అందరికీ సోనూసూద్ లాంటి మనసు ఉంటే.. ఎటువంటి వ్యక్తి కి కష్టాలు ఉండవని కామెంట్లు పెడుతున్నారు.